Monday, 8 July 2019

ఇంట్లో కి ధనం, మనశ్శాంతి రావాలంటే.....*

*ఇంట్లో కి ధనం, మనశ్శాంతి రావాలంటే.....*

ఇంట్లో కి ధనం, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీ దేవికి నచ్చేట్టు ఉండాలట. ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు ఉంటే లక్ష్మీదేవీ ప్రీతికరమని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. ఇంతికీ గుమ్మం ముందు ఏమి ఉంటె లక్ష్మి కటాక్షం కలుగుతుందో ఓసారి చూద్దాం.. ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉండాలి. పొద్దున్నే చీపురుతో శుభ్రపర్చి, నీళ్ళు చల్లి ముగ్గు వేయాలి. ఇది తప్పనిసరిగా చెయ్యాల్సిన పని.

ఎందుకంటే స్మశానం ముందున ముగ్గు వెయ్యరు. కనుక ఇంటి శుభప్రదంగా ముగ్గు వెయ్యాలి. గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులు ఉంచాలి.

లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటుఇటూ పెడితే.. అవి రోజూ మార్చి కొత్తవి పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది. ఒకవేల కలువ పువ్వులు దొరకకపోయినా ఏదోఒక పువ్వులు పెడితే మంచిది.

గుమ్మం కనుక ఈశాన్యం మూల ఉంటె గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది.

గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్ళు తీసుకుని, దానిలో నీళ్ళు నింపి దానిలో 5 రాగి రూపాయల బిళ్ళలు, పచ్చ కర్పూరం, ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కన ఉంచాలి.

ఇలా చెయ్యడం ద్వారా దరిద్రం పోయి, సమస్యలు, అప్పుల బాధలు తొలగి తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుఅవకాశం ఉంటుంది. దేవుడి దగ్గర అవాహనాది పూజ సపర్యలు మరియు మంత్ర జపం చేసిన లక్ష్మి యంత్రం పెట్టిన కూడా మంచి శుభఫలములు కలుగును.

*|| ఓం నమః శివాయ ||*

No comments:

Post a Comment

Melkote, Tri Ranga ( 3 Ranga ) Darshan Tour

2-day trip plan starting from Mysore Railway Station and ending at Srirangam  ---  DAY 1 – Mysore → Melkote → Mysore (Stay) Pick...