Showing posts with label om. Show all posts
Showing posts with label om. Show all posts

Tuesday, 16 February 2021

Vasantha Panchami వసంత పంచమి

మాఘశుద్ధ పంచమిని ‘శ్రీపంచమి’ లేదా 'వసంత పంచమి' అంటారు. వసంతరుతువు రాకను భారతదేశమంతటా వసంతపంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. దీనిని సరస్వతీ జయంతి,మదన పంచమి అనికూడా అంటారు . ఇది రుతు సంబంధమైన పర్వం.వసంత రుతువుకి స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో పేర్కొనబడింది . ఈ దినం మహాసుప్రసిద్ధమైన పర్వదినం. దేవీభాగతం, బ్రహ్మాండ పురాణం వంటి పురాణాలలో ఈ శ్రీ పంచమిని గురించి విశేషంగా చెప్తున్నాయ. సకలవిద్యా స్వరూపిణి అయిన పరాశక్తి ‘సరస్వతీ దేవి’గా జన్మదినంగా చెప్తారు.
శ్రీపంచమి విద్యారంభ దినమని, వాగ్దేవిని ఆరాధించి, అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణంచెప్తుంది. విద్యాదానం జ్ఞానదానమేనని అన్న దానం తర్వాత ఈవిద్యాదానానికే ప్రాముఖ్యత ఉందని అంటారు. సరస్వతీ దేవి శాంతమూర్తియై ఒకచేత వీణ, మరోచేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి వుంటుంది. ఈ మూర్తి విద్య, జ్ఞాన, బుద్దులకు ప్రతీక. ఈ జ్ఞాన ప్రదాయిని కరుణ తోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం.
విద్యచేత వినయం, వినయం చేత జ్ఞానము, జ్ఞానము చేత ధనం, ధనం చేత అధికారము సంప్రాప్తిస్తాయి. ఎవ్వరిచే దొంగిలించబడనిది, నలుగురికి పంచగల శక్తి విద్యకు మాత్రమే ఉంది. సమాజంలో విద్య కలిగినవాడు ధనవంతుని కన్నా, సంఘంలో గొప్పవాడని, ఎక్కడివెళ్లినా బతకకలుగుతాడని శతకకారులు చెప్పడంకాదు నిత్యమూ ఎదురయ్యే విషయమే.
సరస్వతీ ఆరాధన వల్ల వాక్సుద్ధి వస్తుంది. మనిషికి మాటేప్రాణం కనుక ఈ దేవిని ఆరాధించి మనిషి సద్బుద్ధిని పొందుతాడు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అనీ పిలుస్తారు. సరస్వతీ దేవిని పూర్వం అశ్వలాయనుడు ఆరాధించి ఆ తల్లి కటాక్షం పొందాడని అంటారు. సరస్వతీ దేవి ఆరాధించే విధానం ‘సరస్వతీ రహస్యోపనిషత్’ అనే గ్రంథం తెలియపరుస్తోంది.
అందమైన తెల్లని పద్మం సరస్వతికి సింహాసనం. మధురమైన పలుకులు పలికే చిలుక ఆమెకు చెలికత్తె. వాక్కులకు సంకేతములైన వేదములు వాగ్దేవినే ఆశ్రయించి ఉంటాయి. అమ్మ మాటలకు తోడుగా మోగేది వీణ. బ్రహ్మదేవుని ముఖాలు నాలుగు వేదాలకు ప్రతీకలు. కాబట్టి బ్రహ్మ ముఖంలో సరస్వతి ఉంటుందని శాస్త్రోక్తి.
శ్రీపంచమినే రతికామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘ శుక్ల పంచమినాడు రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు. రుతురాజు అయిన వసంతానికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగదేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమి నాడు పూజించడంవల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరఢవిల్లుతాయనే లోకోక్తి కూడా ఉంది. ఇలాంటి ఎన్నో ఆంతర్యాల సమ్మేళనం.
‘‘వాగేశ్వరీ, వాగ్వాదినీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి’’ ఇలా అనేక నామాలు గల ఈ వాగ్దేవి ‘సామాంపాతు సరస్వతి’ అనే మకుటంతో ఉన్న శ్లోకాలతో పఠించడం వల్ల శారదాదేవి సంతోషించి అపార జ్ఞాన రాశిని ప్రసాదిస్తుందని పెద్దలుచెప్తారు.
అదిలాబాద్ జిల్లాలో గోదావరి తీరాన బాసర క్షేత్రంలో వెలసిన జ్ఞాన సరస్వతీ ని ఆరాధిస్తూ ఇక్కడే వేద వ్యాసుడు తపం ఆచరించాడట. అమ్మవారి సాక్షాత్కారం పొంది అమ్మ అనుగ్రహంతోనే వేద విభజన, మహాభారతాది పురాణాలను రచించాడని అంటారు. ఈ అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయస్తే పిల్లలకు అమ్మకరుణ తో జ్ఞాన రాశులు అవుతారని పెద్దల నమ్మకం. ఈ రోజున సరస్వతీ దేవిని తెల్లని పూలతో పూజించాలి. అమ్మవారిని శే్వత వ స్త్రాలతో కాని, పసుపు పచ్చ వస్త్రాలతో కాని అలంకరించాలి. అమ్మ వారికి తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నాన్ని , నేతి పిండివంటలను, చెరకును, అరటి పండ్లను, నారికేళాన్ని నివేదన చేస్తే మంచిఫలితాలు వస్తాయని అంటారు. కుల మత భేదాలు లేకుండా ప్రపంచంమంతా సరస్వతీ దేవిని పూజిస్తున్నప్పటికీ మాఘ మాసంలో వచ్చే ఈ పంచమి తిథి ప్రత్యేకత సంతరించుకొంది. ఈ రోజున బాసర క్షేత్రాల వంటి సరస్వతీ ఆలయాల్లో విశేష పూజలు అర్చనలు జరుపుతారు.
పుష్య, మాఘ ద్వయంతో కూడిన ఆదివారం రోజున శ్రీపంచమి వస్తే, ఆరోజున సూర్యారాధన వల్ల కోటి గ్రహణ స్నానపుణ్య ఫలం లభిస్తుంది

Thursday, 3 October 2019

కర్మ సిద్థాంతం చాలా కఠినమైనది. అది ఎవ్వరికీ అర్థం కాదు

కర్మ సిద్థాంతం చాలా కఠినమైనది.
అది ఎవ్వరికీ అర్థం కాదు .మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది "కర్మను అనుభవించాలి.
నిందిస్తే ప్రయోజనం లేదు. రమణ మహాశయులు కాశీలో
ప్రతిదినము గంగా స్నానం కొరకు పోతుండేవారు.
ఆయన వెంట కృష్ణా  అను భక్తుడు పోయెడివాడు. ఒకనాడు రమణ మహాశయులు
గంగానదికి పోతుంటే ఉన్నట్టుండి , తన వెనుకనున్న కృష్ణా  తో " కృష్ణా  ! నేను
కట్టుకున్న పంచెను కొంచెం చించు ".అని అన్నారు
కృష్ణా కు అర్ధం కాలేదు .వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు నడుస్తూనే ఉన్నారు .ఇంతలో ఒక
ఇటుక వచ్చి రమణ మహాశయుల కాలి వేలు
మీద పడినది .కాలి వేలు చితికింది .రక్తం కారుతుంది .ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశయులు పంచెను చింపమన్నారని అర్థం
చేసుకున్నాడు .కృష్ణా అప్పుడు గ్రహించాడు .
వెంటనే రమణ మహాశయుల పంచెను చింపి, కట్టు కట్టాడు .ఆనుకోకుండా జరిగిన ఆ సంఘటను గుర్తించి ,రమణ మహాశయులతో
"మహారాజ్ ! ఇటుక వచ్చి మీ కాలివేలు మీద
పడుతుందనే విషయము ముందే మీకు తెలుసు కదా ! మరెందుకు ఆ ఇటుక దెబ్బనుంచి తప్పుకోలేదు ? " అని ప్రశ్నించారు .అప్పుడు రమణ మహాశయులు కృష్ణా తో " ఆలా
జరగదు కృష్ణా ! పక్కకి తప్పుకొంటే ,ఎప్పుడో
ఒకప్పుడు వడ్డీతో సహా కర్మను అనుభవించాల్సిందే .రుణం ఎంత తొందరగా
తీరిపోతే అంత మంచింది కదా ! "అని అన్నారు .
కర్మ శేషాన్ని ఎవరయినా అనుభవించాలసిందే .

Monday, 4 March 2019

శివరాత్రిశంకరుడు లోకశంకరుడు:-

శివరాత్రి-శంకరుడు లోకశంకరుడు:-
లోకహితం  కోసం విషం తాగిన వాడు...
అందుకే ‘శవం’ కాకుండా ‘శివం’ అయ్యాడు...
***************
వారంతా అమృతం కోసం పాలసముద్రాన్ని మథిస్తున్నారు.
దేవతలను అమరులుగా చేసేందుకు ‘అమృతం’ కావాలి.
‘అమృతం’ కోసం ప్రయత్నిస్తే వద్దన్నా వచ్చేది ‘హాలాహలం’.
‘హాలాహలం’ కాలకూట విషం. అది నిలువునా ప్రాణులని చంపేస్తుంది.
ఆ తర్వాత అమృతం వస్తే ఎంత? రాకపోతే ఎంత?
హాలాహలం వరకు ఎవరైనా హరించేస్తే ఎంత బాగుంటుంది?
అప్పుడు ఒక ‘బైరాగి’ ముందుకొచ్చాడు.
అతడు బేసి కన్నుల వాడు. గోచిపాత వాడు.
అతను మంచుని, మంటని ఒక్కటిగా లెక్క చేసే తిక్క శంకరయ్య.
చర్మమే ఆయన దుస్తులు......
భస్మమే ఆయన ఆభరణాలు.....
స్మశానమే ఆయన ఇల్లు......
భూతాలు ఆయన మిత్రులు ........
"లోకాల... కోసం నేను విషాన్నిమింగేస్తాను." అన్నాడు.
"రేపు రాబోయే అమృతం కోసం నేడు హాలాహలం తాగేస్తాను" అన్నాడు.
హాలాహల విషమంటే మాటలా? విషం దహించి వేస్తుంది. ఆవిరులు ఊపిరిని ఆపేస్తాయి.
అయినా విషాన్ని ఖుషీగా తాగేస్తానంటున్నాడు తిక్క శంకరయ్య.
"నాకోసం విషాన్ని తాగుతున్నావా తండ్రీ?" ఆప్యాయంగా అనుకుంది పాము.
అంతే చర చర బిర బిర వచ్చి విషం మంటలను తగ్గించేందుకు ఆ శంకరయ్య గొంతుకు చుట్టుకుంది.
విషం గొంతు దిగితే చతుర్దశ భువనాలు ధ్వంసమైపోతాయి.
కాబట్టి అది గొంతు దిగకుండా భార్య ‘పార్వతి’ వచ్చి ఆయనలో తాను సగమైంది.
గొంతును అదిమి పట్టుకుంది.
"జగత్తు కోసం విషం తాగుతున్న ఓ చక్కనయ్యా... నీకు చల్లదనాన్ని పంచుతా".
అంటూ చంద్రుడు శంకరయ్య తలపై కూచుని వేదన తగ్గించే చల్లదనాన్నిచ్చాడు.
శిరోభారం తగ్గించేందుకు గంగ చిరుజల్లులు కురిపించసాగింది.
..
విషం గొంతులో ఉంది.
శంకరయ్య నీల కంఠుడయ్యాడు...
గరళ కంఠుడయ్యాడు....
స్థితి కంఠుడయ్యాడు.
తల తిరుగుతోంది.
మత్తు ఆవహిస్తోంది.
విషం తన పని తాను చేసుకుంటోంది.
రాత్రి గడిస్తే కానీ విషయం అవగతం కాదు.
..
"అయ్యో మాకోసం త్యాగం చేస్తున్నావు. నీకోసం మేముంటాము" అంటూ, సప్త లోకాలు, చతుర్దశ భువనాలు, ముక్కోటి దేవతలు, శతకోటి జనాలు, అశేషకోటి జీవాలు రాత్రి తెల్లవార్లూ అతడిని కనిపెట్టుకుని నిద్ర మాని జాగారం చేశాయి.
‘సమాజం’ కోసం పనిచేసేవాడికి ‘సమాజమే’ తోడు.
‘లోకహితం’ కోరేవాడికి లోకమే హితం చేకూరుస్తుంది.
‘జనం’ కోసం విషం తాగిన వాడు.
అందుకే ‘శవం’ కాకుండా ‘శివం’ అయ్యాడు.
ఆ రాత్రి శివరాత్రి అయ్యింది!!!

Sunday, 3 March 2019

దేవదేవుని_రహస్యం_ వేంకటేశ్వరస్వామి రూపమే...  ఆయన ఎవరిని అనుగ్రహిస్తారు అనంటే ఎవరైతే మనసునిండా ఆయననే నింపుకుని బాధ కలిగిన భాగ్యం కలిగినా నీ కరుణే కదా స్వామి

Spiritual messages from www.saisaranam.in
దేవదేవుని_రహస్యం
చూసే వారి మనసుని ఆనందం తో ముంచెత్తి ఈ జన్మకిది చాలు స్వామి అని మనసు పొంగిపోయోలా పరవశం కల్పించే రూపం ఏదైనా ఉన్నదంటే అది నిజం గా ఆ వేంకటేశ్వరస్వామి రూపమే...  ఆయన ఎవరిని అనుగ్రహిస్తారు అనంటే ఎవరైతే మనసునిండా ఆయననే నింపుకుని బాధ కలిగిన భాగ్యం కలిగినా నీ కరుణే కదా స్వామి అని ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నమస్సుమాంజలులు సమర్పిస్తారో వారికి వారి అవ్యాజమైన ప్రేమకు ఆ దేవదేవుడు ఎల్లప్పుడూ అందుబాటులో నే ఉంటాడు...
వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే..
ఈశ్వరుడు అంటాడుట “నేను చెప్పినట్టు మీరు నడుచుకోవడమే మీరు నాకు ఇచ్చే పెద్ద దక్షిణ. భగవంతుడు బంగారానికి,వజ్రాలకి పొంగిపోయే ఆయన కాదని చెబుతూ గురువు గారు ఈ కధ చెప్పారు.
ఇది వరకు తిరుమలలో “తొండమాన్ చక్రవర్తి” అనే ఆయన స్వామి వారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడట. అప్పట్లో స్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా. ఈ తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామి వారి దగ్గరికి వెళ్లి చెబుతూ ఉండేవాడుట – స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నాను. పైగా, నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి అన్నాడుట. స్వామి వారికి చిరాకు వేసి వీడికి ఒక పాఠం చెప్పాలని, నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గర లోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు. వాడిని వెళ్లి చూడు అన్నారుట స్వామి. మరుసటి రోజు వెళదాం అని అనుకుని, స్వామి వారి పాదాల క్రింద ఉన్న తులసి దళాలని శుభ్రం చేస్తున్నాడుట. అప్పుడు, తను చేయించిన బంగారు తులసి దళాల క్రింద, మట్టి తులసిదళాలు కనిపించాయుట. స్వామి వారు చెప్పారుట ఈ మట్టి దళాలు, ఆ భీముడే సమర్పించాడు నాకు అని. అప్పుడు మనసులో అనుకున్నాడుట, మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా, వీడు ఎవరో కాని వెంటనే వెళ్లి కలవాలని బయలుదేరాడుట. ఆ రోజు చాల ఎండగా ఉంది, అప్పటికే నడిచి నడిచి, భీముడి ఇంటి దగ్గరలో స్పృహ తప్పి పడిపోయాడుట. అప్పుడు ఆ భీముడే,తొండమాన్ చక్రవర్తి ని లేవదీసి తన ఇంటికి తీసుకువెల్లాడుట. తొండమాన్ చక్రవర్తి అడిగాడుట, ఒరేయ్ నువ్వు ఏమి చేస్తూ ఉంటావు? వేంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాల ఇష్టం.
భీముడు అన్నాడు, నేనేం చేస్తాను స్వామి
- కుండ చేసేముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు.
- కుండలు చేసుకునే శక్తి ని ఇచ్చావు.
- అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేసావు
- వాటి వల్ల నా సంసారం సాగుతోంది.
- నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవాడుట. ఏ పని మొదలుపెట్టినా “గోవింద” నేను చేయడమేమిటి? నీవే నాతో చేయించు కుంటున్నావు స్వామి అనేవాడుట?
అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నారుట,
వీడేమో – అంతా స్వామి వారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు,
నేనేమో – నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను.
ఇదే మనమందరము చేసే పెద్ద తప్పిదం.
భీముడు అన్నం తినే ముందు మట్టి తో చిన్న మూకుడు చేసి, అందులో అన్నం ముద్ద పెట్టి, స్వామి వారికి సమర్పించి తను తినేవాడుట. స్వామి వారు భీముడి భక్తి కి పొంగిపోయి శ్రీదేవి, భూదేవి సహితుడై, దివ్య విమానం లోంచి దిగి, భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యారుట. వెంటనే స్వామి వారు భీముడిని కౌగలించుకుని, భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి, తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్ని భీముడి మెడలో వేసారు.
అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, వారి ఆభరణాలన్నిభీముడి భార్యకి తొడిగారుట. స్వామి వారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని సశరీరంగా, వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశించారు. ఇప్పటికి స్వామి వారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగు అన్నం. ప్రతి రోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు. అదొక్కటే తింటారు స్వామి వారు.
సారాంశం:
ఎక్కడ భక్తి ఉందో అక్కడ వశుడై పోతాడు స్వామి.
ఎక్కడ గర్వం/అహంకారం ఉన్నాయో అక్కడ ఆయన ఉండరు.
సమస్త అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడాయన. ఈశ్వరా ఇదంతా
నీ సృష్టే తండ్రి, నేను నీకు ఏమైనా ఇవ్వగలనా అని అనుకోవాలట
www.saisaranamyatra.com

Saturday, 2 March 2019

శ్రీ కపోతేశ్వర స్వామీ దివ్య సన్నిధి. కడలి గ్రామం .రాజోలు మండలం

కోనసీమలో  దర్శించవలసిన దివ్యక్షేత్రాలు – www.saisaranam.in
శ్రీ కపోతేశ్వర స్వామీ దివ్య సన్నిధి. కడలి గ్రామం .రాజోలు మండలం .తూ.గో.జిల్లా.
ఈ ఆలయం అతి పురాతన మైనది. 15,16 శతాబ్దాల మధ్య నిర్మించబడిన దేవాలయం.
శ్రీ కపోతేశ్వర స్వామీ స్వయం భూ గా వెలసినారు. ఈ ఆలయప్రతిష్ట కు పురాణ ఆధారంగా చెప్పాల్సిన విషయం  ఒకటి ఉన్నది. పూర్వకాలం లో ఒక వేట గాడు వేట నిమిత్తం ఈ ప్రాంతం లో సంచరిస్తూ ఉండగా విపరీతమైన వాన వచ్చినదట, ఆబోయ ఒక చేట్టు నీడను నిలుచున్నాడట, ఎంత సేపటికీ వర్షం తగ్గలేదు . ఆవృక్షం  పైన నివసిస్తున్న పావురాల జంట  ఇతనిని గమనించి చాలాసేపటి నుండి చెట్టుక్రింద నిరాహారం గా వున్నా ఇతనిని చూచి భాదపడి, తమ గూటిని క్రిందకు గెంటి దానిపై చెట్టు బెరడు రాపాడగా వచ్చిన నిప్పుతో మంట రగిల్చి, దానిలో పడి అతనికి ఆహారం గా మారాయట ఇది గమనించిన బోయవాడు పావురాల త్యాగ బుద్దికి చలించి పోయి ఆతను ఆ మంట ను మరింత రగిలించి తనుకూడా అగ్నికి ఆహుతి అయ్యేనట. ఇది కైలాసంలో ఉన్న శివుడు గమనించి కపోతాల త్యాగనిరతికి సంతసించి వాటిని బ్రతికించెనట . ఆకపోతాలు ఆ బోయనుకుడా బ్రతికించమని వేడుకోగా పరమ శివుడు, ఆ బోయకూ  ఆ కపోత జంటకూ  శివసాయుధ్యము అనుగ్రహించి ఈ సందర్భం గా అక్కడ కపోత త్యాగనిరతి కి గుర్తుగా కపోత రూప గుర్తులతో స్వయం భూ గా శివుడు  కపోతేశ్వర స్వామిగా వేలసెనట. శివ  లింగ ము పై ముందు వెనుక కపోత తల, రెక్కలు,పొట్టా ఆకారాలు గుర్తులుగా నేటికీ కనిపిస్తూ ఉంటాయి.
ఈ స్వామిని దర్శించుకుంటే  మానసిక శాంతి కలుగుతుందని, క్షుద్భాధ ఉండదని, అన్న వస్త్రాలకు లోటు రాదని భక్తుల విస్వాశం . శాంతి చిహ్నాలైన కపోత గుర్తు లు కలిగిన కపోతేశ్వర స్వామిని దర్శించిన వెంటనే మనసు కూ స్వాంతన లభిస్తుందని ,ఆందోళనలు , భయాలు, విచారం లో ఉన్నవారికి స్వామిని దర్శించగానే ఆత్మస్థైర్యం వచ్చి  నూతనోత్సాహం తో తలచిన కార్యాల విజయాలు పొందుతారని భక్తులు విశ్వసిస్తారు 
ఈ ఆయము సమీపంలో కపోత కుండము కలదు .ఈ తటాకం లోనికి అంతరవాహినిగా గంగానది ప్రవహిస్తుందని , ఈ కుండము లో జలము గంగాజలము తో సమానమైన పవిత్రత కలిగినదని స్థల పురాణము వలన తెలియుచున్నది. సమీపముననే స్మశాన వాటిక కలదు. ఈ రెండు కారణముల చే ఈ క్షేత్రాన్ని భక్తులు దక్షణ కాశీ గా భావిస్తారు 
శ్రీ ఆదిశంకరాచార్యులు వారు ఈ ఆలయంలో శ్రీ చక్ర సహిత బాలా త్రిపుర సుందరీ దేవిని ప్రతిష్టించినారని స్థల పురాణము వలన తెలుయుచున్నది.
కపోతేశ్వర స్వామీ ఆలయ ప్రదక్షణ మార్గంలో వినాయకుడు. శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రుడు, కుమారస్వామి,శ్రీ సీతా రాములు,నవగ్రహాలు,కాలభైరవుడు ,లింగ రూపుడుగా శ్రీ సూర్యనారాయణ మూర్తి వారల ఉపాలయాలు ఉన్నవి.
ఈ క్షేత్రానికి పాలకుని  గా జనార్ధన స్వామీ కొలువై ఉపాలయములో ఉన్నారు.
ఈ ఆలయం సమీపాన సువర్చలా సమేత ఆంజనేయ స్వామీ ఆలయం,మరియు శ్రీ, భూ,సమేత శ్రీ సత్యనారాయణ స్వామీ ఆలయములు కలవు.
కడలి గ్రామము అమలాపురం  నుండి రాజోలు వెళ్ళు    N.S.214 రహదారి లోని మామిడికుదురు గ్రామానికి  4 కి.మీ దూరములో ఉన్నది పాలకొల్లు నుండి అమలాపురం వెళ్ళు R.T.C. బస్సులో కానీ అమలమలాపురం నుండి రాజోలు వాళ్ళు బస్సులోగానీ మామిడికుదురు లో దిగి ఆటోలలో కడలి గ్రామము వెళ్ళవచ్చును.
గోదావరి పుష్కరాలకు ఈ ప్రాంతం సందర్శించు భక్తులు కడలి గ్రామములోని శ్రీ కపోతేశ్వర స్వామిని దర్శించి కపోత త్యాగనిరతిని శ్లాఘించి , కపోతేశ్వరస్వామిని అర్చించి తరించండి,
www.saisaranamyatra.com

Wednesday, 6 December 2017

Man walks with two legs: iha and para (this world and the other),

OM SAI RAM
THOUGHT FOR THE DAY
Man walks with two legs: iha and para (this world and the other), dharma and Brahman, righteousness and God! If one is totally engrossed in this world, the person is choosing to travel all through one’s life with a handicap, hopping on one leg. That is fraught with trouble; the person may fall any moment and break the shin. And one does! Goodness in this world and Godliness for the life after death - equal attention needs to be given to both. One must be vigilant while taking a step, whichever foot it may be. Both are essential for a happy journey through life. You have to put the right foot, the Brahman step, when you enter the region of realisation. By then the senses have to be conquered. Go means senses and Go-pi means a person who has subdued the senses, as a result of surrender to Go-pala, the master of the senses. Krishna once told Arjuna that he can enter Vrajamandala (the region where the Gopis lived), only after mastering his emotions and impulses, and his tendency to yield to the senses. [Divine Discourse, Jan 13, 1968]

- BABA

SOUTH INDIA PACKAGE OPTIONS-- Group tours, students tours, honeymoon

*SOUTH INDIA PACKAGE OPTIONS:* * *Group tours, students tours, honeymoon| FIT* *For complete quotation (tailor-made) & fastest reply* , ...