Showing posts with label sai saranam. Show all posts
Showing posts with label sai saranam. Show all posts

Saturday, 11 December 2021

Narayan Mahraj of Khedgaov Bhet was a well known Satpurush.

Narayan Mahraj of Khedgaov Bhet was a well known Satpurush.
 Sai bhakta Bapu Saheb Jog ( Baba's priest for several years after Meghashyam's niryan  in 1912) often used to visit this saint and wished to settle there in Bhet after His retirement as PWD supervisor.However Baba has other plans for Him and made Him settled in Shirdi. Narayan Mahraj and Sai Baba had cordial relationship with eachother.
Read sai Satcharitra. Get sai blessings.
www.saisaranam.in 
Jai sai nath maharaj ki
Sai saranam Baba saranam

Wednesday, 27 May 2020

‘ది సేక్రెడ్‌ ఫుడ్‌ ఆఫ్‌ గాడ్‌’ (స్వామివారి పవిత్ర ప్రసాదాలు)

 ‘ది సేక్రెడ్‌ ఫుడ్‌ ఆఫ్‌ గాడ్‌’ (స్వామివారి పవిత్ర ప్రసాదాలు)  - 
‘సేక్రెడ్‌ ఫుడ్స్‌ ఆఫ్‌ గాడ్‌’....తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు

  తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి... చక్కెర పొంగళి, పెరుగన్నం ప్రసాదాలూ స్వామి వారికి సమర్పిస్తారనీ తెలుసు. మరి... వెంకన్నకు కమ్మని దోసెలు పెడతారని తెలుసా? ఘాటైన మిరియాల అన్నం వండి వడ్డిస్తారని తెలుసా? ఇవి మాత్రమే కాదు... ఏడుకొండల వాడికి పూట పూటకూ ఒక మెనూ! రుతువులను బట్టి ఆహారం! స్వామి వారికి సకల విధమైన నైవేద్యం! అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ వివరాలతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ‘ది సేక్రెడ్‌ ఫుడ్‌ ఆఫ్‌ గాడ్‌’ (స్వామివారి పవిత్ర ప్రసాదాలు) అనే పుస్తకం రాశారు. దాని తొలి ప్రతిని ఆయన అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి అందించారు. ఏడు కొండల వాడి దివ్య ప్రసాదాలపై పుస్తకంలోని విశేషాలను రమణ దీక్షితులు ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

 ఆ వివరాలు మీకోసం ప్రత్యేకం...

సర్వజగద్రక్షకుడైన ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి, ఏ పదార్థాలు ఏ కొలతలతో ఉండాలి, ఎవరు వండాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి వంటివన్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. అచ్చంగా దాని ప్రకారమే తిరుమలలో ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది. ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే ఉపయోగిస్తారు. పాలుగారే చెట్ల కొమ్మలు, ముళ్ల చెట్లుగానీ వంటకు వినియోగించరు. ప్రసాదం వండేవారు వంట సమయంలోగానీ, తర్వాతగానీ వాసన చూడరు. వాసన సోకకుండా ముక్కు, నోటికీ అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. ఇక... శ్రీవారికి సమర్పించేదాకా బయటి వారెవరూ దానిని చూడకూడదు.

 

నేవైద్యం పెట్టేది ఇలా...

ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్ళతో శుద్ధి చేస్తారు. గాయత్రీ మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూత పెట్టిన గంగాళాల్లో దేవుడి ముందు ఉంచుతారు. స్వామి, ప్రసాదాలు, నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. గర్భాలయం తలుపులు మూసేస్తారు. విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసి ఆకులు చల్లుతారు. కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడి చేతికి దానిని తాకించి, నోటి దగ్గర తాకుతారు. (స్వామికి గోరు ముద్దలు తినిపించడం అన్న మాట.) పవిత్ర మంత్రాలు ఉచ్ఛరిస్తూ అన్నసూక్తం నిర్వర్తిస్తారు. చరాచర సృష్టికి కర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించడం అంటే, సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్నీ సంతృప్తి పరచడమే. ఈ విధంగా స్వామిని వేడుకుంటూ, ముద్ద ముద్దకీ నడుమ ఔషధగుణాలున్న ఆకులు కలిపిన నీటిని సమర్పిస్తారు.

 

నైవేద్యం సమర్పించేంత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. ఇది స్వామికి భోజనానికి పిలుపుగా దీనిని భావిస్తారు. రోజుకు మూడు పూటలా స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం ఆరు, ఆరున్నర గంటల మధ్య బాలభోగం సమర్పిస్తారు. పది, పదకొండు గంటల మధ్య రాజభోగం, రాత్రి ఏడు - ఎనిమిదింటి మధ్య శయనభోగం సమర్పిస్తారు. తిరుమల గర్భగుడిలోని స్వామి మూల విగ్రహం ఎత్తు 9.5 అడుగులు. దీనికి అనుగుణంగానే స్వామికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో నిర్దేశించారు. నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు. ప్రత్యేక రోజులలో ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తారు.

 

ఉదయం బాలభోగం

    మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ్వ కేసరి

మధ్యాహ్నం రాజభోగం

    శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గూడాన్నం, దద్యోజనం, శీర లేక చక్కెరన్నం

రాత్రి శయనభోగం

    మరీచ్యఅన్నం (మిరియాల అన్నం) దోసె, లడ్డు, వడ, శాకాన్నం(వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నం)

అల్పాహారాలు

    లడ్డు, వడ, అప్పం, దోసె

స్వామి మెనూ ఇదీ...

ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన తర్వాత అప్పుడే తీసిన చిక్కని వెన్న నురుగు తేలే ఆవుపాలు సమర్పిస్తారు. తోమాల, సహస్రనామ అర్చన సేవల తరువాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడుతారు. ఆ తరువాత బాలభోగం సమర్పిస్తారు. దీంతో ప్రాతఃకాల ఆరాధన పూర్తవుతుంది. సర్వదర్శనం మొదలవుతుంది. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వదర్శనం మొదలవుతుంది. సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయం శుద్ధి చేసి... స్వామిని తాజా పూలతో అలంకరిస్తారు. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అంతటితో అయిపోయినట్టు కాదు! అర్ధరాత్రి తిరువీశం పేరుతో బెల్లపు అన్నం (శుద్ధాన్నం, గూడాన్నం) పెడతారు. ఇక పవళించే సమయం దగ్గరపడుతుంది. ఏకాంత సేవలో భాగంగా నేతిలో వేంచిన బాదం, జీడిపప్పులు వంటివి, కోసిన పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు.

 

ఇదీ ‘ప్రసాదం’

బియ్యం, ధాన్యాలు, ఆవు పాల పదార్థాలు, ఔషధ గుణాలున్న వస్తువులు, వనస్పతులు, లవంగాలు, యాలకులు, తులసి, మిరియాలు... ఇవన్నీ శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోస్తారు. హింసలేని ప్రపంచాన్ని కోరుకున్న మహర్షులు నిర్దేశించిన ప్రసాదాలు ఇవి! ప్రసాదం అంటే ఆకలి తీర్చే ఆహారం కాదు! పవిత్రంగా పరిమితంగా స్వీకరించవలసిన పదార్థం. ఈ అంశాలను భక్తజనానికి వివరించడమే ఈ పుస్తక పరమోద్దేశం! ‘సేక్రెడ్‌ ఫుడ్స్‌ ఆఫ్‌ గాడ్‌’ పుస్తకాన్ని రాయడానికి నాకు రెండేళ్ల సమయం పట్టింది.

 

నా అనుభవాలన్నిటినీ ఇందులో రాశాను. ఈ పుస్తకంపై వచ్చే రాయల్టీని తిరుమలలోని అన్నప్రసాద పథకానికి ఇవ్వాలని సంకల్పించాను. ఈ పుస్తకాన్ని చూడగానే రాష్ట్రపతి అభినందించారు. ప్రపంచంలోని శ్రీవారి భక్తులందరికీ అర్థమవ్వాలనే తొలిగా ఆంగ్లంలో విడుదల చేశాం. త్వరలో తెలుగు, తమిళం, హిందీ, ఇతర భాషల్లో విడుదల చేయటానికి ప్రయత్నిస్తున్నాం. అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థ అయిన పెంగ్విన్‌ శ్రీవారి వైభవాన్ని తెలిపేలా పుస్తకాలను రాయమని కోరారు. స్వామి ఉత్తర్వులే అనుకుని రాయటానికి ఒప్పుకున్నాను.

- *రమణ దీక్షితులు, టీటీడీ ప్రధానార్చకుడు*
 Detional information by www.saisaranam.in

Sunday, 8 September 2019

మహాలయ అమావాస్య..కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే “ మహాలయపక్షము లేదా పితృ పక్షములు అని పేరు వచ్చింది.

*మహాలయ అమావాస్య.....*

దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గలోకం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఆకలి -  దప్పిక కలుగుతాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని దాన్ని తాకడంతోనే ఆశ్చర్యంగా ఆ పండు  బంగారపు ముద్దగా మారిపోయింది.
ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది.

ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారి పోయింది. ఆ తరువాత
స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ఆకాశవాణి ఇలా పలికింది..

''కర్ణా ! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది " అని చెప్పగానే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి మాతా పితరులకు తర్పణాదులు వదిలి తిరిగి రమ్మన్నాడు.

ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు , బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణములు వదిలాడు. తిరిగి అమావాస్య నాడు స్వర్గానికెళ్లాడు.

ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండి పోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే “ మహాలయపక్షము లేదా పితృ పక్షములు అని పేరు వచ్చింది. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

*|| ఓం నమః శివాయ ||*

Spiritual message by sai SARANAM Shirdi tour, Chennai.
www.saisaranam.in
9840344634 / 9087666333

Wednesday, 4 September 2019

శ్రీ దత్త క్షేత్ర బాలోద్* శ్రీ దత్త క్షేత్రం నర్మదా నది ఒడ్డున గుజరాత్ లో బురూచ్ జిల్లాలో ఉంది.

*శ్రీ  దత్త క్షేత్ర బాలోద్*
శ్రీ దత్త క్షేత్రం నర్మదా నది ఒడ్డున గుజరాత్ లో బురూచ్ జిల్లాలో ఉంది.ఇక్కడ గౌతమ్ మహర్షి ఘోర తపస్సు చేసిన స్థలం.నచికేత్,యమునికి సంభందించిన కధ ఇక్కడే జరిగింది. నచికేత్ యముడి కోసం తపస్సు చేయగా యముడు జ్ఞాన బోధ చేసిన ప్రాంతం.ఇక్కడ దత్త మూర్తి ఆదిశంకరులు వర్ణించిన యోగ లో ఉన్న షట్ చక్రాలు దత్త మూర్తి లో కలిగిన సాలిగ్రామo తో చేయబడిన సుందర  ధ్యాన మూర్తి దత్త.స్వామి వక్షస్థలంలో  అగ్ని,గోముఖ్o, నొసటన అజ్ఞాచక్రం, గొంతు దగ్గర విశుద్ది చక్రం,నాభి లో మణి పూరకం,హృదయం దగ్గర కమలం,క్రిందగా 4 రేకులు కలిగిన ములధార చక్రం అనాహిత చక్రాలు సూక్ష్మంగా కనపడతాయి.ఈ విగ్రహం నల్లగా ఉన్న సాలిగ్రామ మూర్తి.ఇక్కడ ఔదుంబర్ వృక్షం లో స్వయంభూ గణపతి వున్నారు.ఇక్కడ గురుచరిత్ర పారాయణ జరుగుతుంది.సప్తాహ  పారాయణ చేసుకునే వారికి భక్త నివాస్ ఉంది.భోజనం కూడా దొరుకుతుంది.
శ్రీ క్షేత్ర బాలోద్, తాలూకా జగడియా,జిల్లా బరూచ్,గుజరాత్.
Ph no.02645-243603
M.no_07738360880

Thanks to sai SARANAM Shirdi tour, Chennai
9840344634 / 9087666333
www.saisaranam.in

Tuesday, 5 March 2019

Shirdi Tour - Train Packages From Chennai


Features Of Shirdi Tour - Train Packages From Chennai

SAI SARANAM Shirdi Tours provides 2.5 days tour package from Chennai To Shirdi in mode of Flight and AC Bus transportation.
Sai Saranam organize shirdi tour by train  from Chennai to Pune for SAI DEVOTEES and A/C Coach Bus will be provided for SAI DEVOTEES from Pune to Shirdi.
Return A/C bus will be provided from Shirdi to Pune and then Pune To Chennai by Train.
The Shirdi Tour Package includes Train Fare, A/C Deluxe Bus Transfer, Food and Accommodations, 1 VIP Sai Baba Darshan.

Day 1 
The SAI DEVOTEES will be departure from Chennai to Pune.
Day 2 -
>The SAI DEVOTEES will reach Pune at early morning.
>From Pune they drive to Shirdi through A/C bus.
> Check in hotel at Shirdi.
> South Indian buffet breakfast will be provided
> After Breakfast SAI DEVOTEES will be proceeding to Sai Baba Samadi Mandhir Darshan and Visit all the holy places in shirdi
> After Darshan South Indian buffet lunch will be provided.
>After lunch, people will be allowed for shopping/purchase
> at 8:00 pm  South Indian dinner will be provided.
Night halt at shirdi.

Day 3 -

05.30 Hotel Check out and Proceed to Grishneshwar
> Grishneshwar jyothirlinga darshan
>  Buffet breakfast at Grishneshwar
> After Break fast Ellora sight seeing
>  Buffet Lunch at Grishneshwar
> After lunch Proceed to Badra Maruti Temple Darshan
> After Badra Maruti Temple Darshan Proceed to Aurangabad
> Aurangabad Mini Tajmahal Sight seeing
> Proceed to dattatreyar Temple Darshan
> Proceed to Shani Signapur darshan
> After Shani Signapur darshan Proceed to hotel for dinner
>After Dinner proceed to Pune Railway Station
> Board train to return journey from Pune Railway Station

Day 4 -Return journey to Chennai from Pune.

 SAI SARANAM Shirdi Tours offers exclusive Shirdi Tour Packages from Chennai, Coimbatore, Bangalore. We provide Shirdi Trip by Flight and by Train mode of transportation for our devotes. We arrange Shirdi Tour Trip at most affordable cost and also provide convenient travel for our customers or travelers. We deliver excellent services with food and accommodation for the travelers.
Address : Sai Saranam, 75 A, 1st Floor, North Railway Station Road
Behind Axis Bank, Korattur, Chennai,Tamilnadu,India
Phone No:  9087 666 333 | 9840 344 634 / Email:  info@saisaranam.in

ICICI BANK -
Bank Name
:
ICICI
Acc Name
:
SAI SARANAM
Acc no
:
219005500190
Branch
:
Korattur
A/C Type
:
Current Account
Place
:
Chennai
Ifsc
:
ICIC0002190

Offers
Get 1 free Train / Flight ticket to family / Group
Pay for 15 members and get 16 train tickets- 1 ticket free
Pay for 30 members and get 31 flight tickets- 1 ticket free

sai saranam shirdi tours-2 days trip from Chennai


sai saranam shirdi tours.
75 A, 1st Floor, North Railway Station Road,Behind Axis Bank, Koratur,Chennai,Tamilnadu

9840344634 /  9600067801 / 9087666333

2 days  trip from Chennai

Chennai to pune by Flight. Pune to shirdi by AC Bus - Return to Pune by AC Bus - Pune to Chennai By Flight (Includes Food and Accommodation).

Day 1

- 03.30 Travel from Chennai to Pune by Flight
- Arrive Pune airport at 05.15
- Our A/C Volvo bus will start from airport to Shirdi
- On the way Breakfast, Darshan at Mahaganapathy temple and reach to Shirdi by 13.00
- Check in Hotel at Shirdi, Buffet south indian lunch will be provided followed refreshment
- There after proceed for Darshan will be at 15.00.
- Places will be covered in Shirdi
      - Saibaba samadhi Mandir , Gurusthan (Holy Neem Tree) , Maruti Mandir, Baba's Chavadi, Dwarakamai Masjid , Adul Baba cottage, House of laxmibai Shinde, Dixit Wada Museum, Lendi Baug
 - After Darshan return to hotel. Buffet Dinner 20.00 at hotel
- Night halt at Shirdi.

Day 2

- 07.30 Breakfast
- Shopping span and Mukh darshan upto 11.00
- Then 12.00 Check out from hotel with the buffet lunch
- Proceed to Shanishignapur, Darshan at Shanishignapur temple at 15.00 - 15.30
- Then proceed to pune buffet dinner at 19.30 - 20.00 at hotel
- Drop at pune airport at 21.00
- Arrive at chennai airport at 00.40
Package Includes :
Two Way Economy Class Air tickets - Chennai / Pune / Chennai
Transportation in A/C Bus – Pune / Shirdi / Pune
Accommodation in Star Hotel at Shirdi / Buffet Breakfast , Buffet Lunch , Buffet Dinner ( 2 Days / 6 Food )
Package Excludes :
Room Service, Tips, Phone Calls from rooms, Laundry, Insurance
Personal Expenses not included
Kind Note: Cellphone, cameras and other electronic items are not permitted inside the temples premises. SAI SARANAM IS NOT RESPONSIBLE FOR PERSONAL BELONGINGS
Shirdi Trip and itinery Cost - Rs 11,900 /- per PAX (head) Includes Transportation, Twin sharing in AC Room and Foods.
For Children below 2 Years 3500Rs  and Children between 2 to 5 year = 10500
Mode of Booking :
Booking to be done 30 days prior to departure date.
Note : If Booked 60 days before One Aarathi will be free ( T&C apply- DISCOUNT OR AARATHI)



What is the significance of Lingodbhava?

spiritual message from sai saranam shirdi tours

www.saisaranamyatra.com

(courtesy Rajeev Mahajan) 

What is the significance of Lingodbhava? 

God is known as Hiranyagarbha (one having a golden womb). 

The golden Rasa (essence) present in His womb undergoes a vigorous churning process and assumes the shape of a Linga. 

Linga means a symbol or a sign. (Showing the golden Linga that He created at the beginning of His Discourse) Bhagavan said - As you can see, it has no distinctive features like eyes, face, etc. It has neither feet nor head. It can be placed in any manner. It symbolizes the formless Divinity.

Leeyathe Gamyathe Ithi Lingaha It is the basis of everything. The golden Rasa after assuming the shape of a Linga emerges out. 

You need fire in order to melt gold. 
Similarly, the fire within melts the gold and molds it into the shape of a Linga. 

Hence, the difficulty at the time of its emergence. 

It has to assume the form of a Linga and come out. 

You feel Swami is put to a lot of Badha (suffering) at the time of Lingodbhava. 

It is not really a Badha (suffering) but a Bodha (teaching) for you. 

Is it not natural for a mother to undergo labor pains while giving birth to a child? 

Will any mother curse her child just because she is put to a lot of suffering? 

She always prays for the well-being of the child. 

In the same manner, Swami does not feel any pain at the time of the emergence of Linga. 

I don't consider it a Badha. I am happy that I am imparting a significant Bodha to so many of you. 

God has absolutely no suffering, no worries and no difficulties whatsoever. 

But you feel that Swami is undergoing great pain and suffering.

Divine Discourse: Mar 12, 2002

thanks from shirdi tours
sai saranam, chennai

The Teachings of Bhagavan Sri Ramana Maharshi in His Own Words

spiritual message from sai saranam shirdi tours

www.saisaranamyatra.com

*The Teachings of Bhagavan Sri Ramana Maharshi in His Own Words– 086 *

_Mental invocation is better than oral _

Devotee: When I invoke the Divine Name for an hour or more I fall into a state like sleep. On waking up I recollect that my invocation has been interrupted, so I try again.

Bhagavan: ‘Like sleep’, that is right. It is the natural state. Because you now identify yourself with the ego, you look upon the natural state as something which interrupts your work. So you must have the experience repeated until you realise that it is your natural state. You will then find that the invocation is extraneous, but still it will go on automatically. Your present doubt is due to false identification of yourself with the mind that makes the invocation. Invocation really means ‘clinging to one thought to the exclusion of all others’. That is the purpose of it. It leads to absorption which ends in Self-realisation or Jnana.

D: How should I practise invocation?

B: One should not use the name of God mechanically and superficially without a feeling of devotion. When one uses the name of God one should call on Him with yearning and unreservedly surrender oneself to Him. Only after such surrender is the name of God constantly with you.

D: Isn’t mental invocation better than oral?

B: Oral incantation consists of sounds. The sounds arise from thoughts, for one must think before one expresses one’s thoughts in words. The thoughts form the mind. Therefore mental invocation is better than oral.

D: Shouldn’t we contemplate the invocation and repeat it orally also?

B: When the invocation becomes mental, where is the need for sound? On becoming mental, it becomes contemplation. Meditation, contemplation and mental invocation are the same. When thoughts cease to be promiscuous and one thought persists to the exclusion of all others, it is said to be contemplation. The object of invocation or meditation is to exclude varied thoughts and confine oneself to one thought. Then that thought too vanishes into its source, which is pure Consciousness or the Self. The mind first engages in invocation and then sinks into its own source.
This is certain: worship, incantations and meditation are performed respectively with the body, the voice and the mind and in this they are of ascending order of value. One can regard this eight-fold universe as a manifestation of God; and whatever worship is performed in it is excellent as worship of God.

The repetition aloud of His name is better than praise. Better still is its faint murmur. But the best is repetition with the mind – and that is meditation, above referred to.

Better than such broken thoughts (meditation) is its steady and continuous flow like the flow of oil or of a perennial stream.

thanks from sai saranam shirdi tours
to
Edited by: Arthur Osborne 

గీతా మకరందము - విభూతియోగము


spiritual message from sai saranam shirdi tours
www.saisaranamyatra.com

 10-36-గీతా మకరందము
          విభూతియోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ | 
జయోఽస్మి వ్యవసాయోఽస్మి 
సత్త్వం సత్త్వవతామహమ్ || 

తా:- వంచక వ్యాపారములలో నేను జూదమును అయియున్నాను. మఱియు నేను తేజోవంతులయొక్క తేజస్సును (ప్రభావమును), (జయించువారలయొక్క) జయమును, (ప్రయత్నశీలురయొక్క) ప్రయత్నమును , (సాత్వికులయొక్క) సత్త్వగుణమును అయియున్నాను. 

వ్యాఖ్య:- ప్రపంచములోగల సమస్తపదార్థములందును, మంచివానియందుగాని, చెడ్డవానియందుగాని, భగవానుని అస్తిత్వము కలదు. వారి సాన్నిధ్యమే ప్రపంచములోని సమస్తపదార్థములకు, క్రియలకు శక్తిని ప్రసాదించుచున్నది. ఈ సత్యమును నిరూపించుటకు భగవాను డీ విభూతియోగమున కొందఱు దేవతలను, దానవులను, జంతువులను, జడపదార్థములను, కొన్ని క్రియలనుగూడ పేర్కొనెను. సంక్షేపించి చెప్పుటవలన ఒక్కొక్క తరగతికి ఒక్కొక్కటి చెప్పుకొనుచుపోయిరి. ఏ వస్తువును జూచినను, ఏ క్రియను పరికించినను అచ్చోట సాక్షాత్ భగవానునియొక్క అస్తిత్వమును భావనచేయవలెను. ఈ ఉద్దేశ్యముచేతనే జూదవిషయ మిచట ప్రస్తావింపబడినది కాని, దానిని ప్రోత్సహించవలెననిగాని, అనుసరించవలెననిగాని, అది ఉపాదేయమనిగాని అభిప్రాయము గాదు. ‘నేను మృగములలో సింహమును’ అని చెప్పినంతమాత్రమున సింహముతో ఆటలాడుకొనుమని అర్థముకాదుగదా! అట్లే ఈ జూదవిషయమున్ను  - అని గ్రహించుకొనవలయును. 
      ‘వ్యవసాయము’ అనగా ప్రయత్నము  తానని భగవానుడే పేర్కొనుటవలన మోక్షవిషయమున ప్రయత్నరహితులుగ, సోమరులుగనుండక సత్ప్రయత్నమాచరించుచుండుట శ్రేయస్కరమని తేలుచున్నది. ఎచట తేజము (ఉత్సాహము , ధైర్యము మున్నగునవి) ఉండునో, ఎచట దయయుండునో, ఎచట సత్ప్రయత్నముండునో, ఎచట సత్త్వగుణముండునో అచట తానుండునని భగవానుడు పలికిరి. కావున ఆ యా సద్గుణములను చక్కగ అలవఱచుకొనవలెను.
thanks from sai saranam shirdi tours

Monday, 4 March 2019

శివరాత్రిశంకరుడు లోకశంకరుడు:-

శివరాత్రి-శంకరుడు లోకశంకరుడు:-
లోకహితం  కోసం విషం తాగిన వాడు...
అందుకే ‘శవం’ కాకుండా ‘శివం’ అయ్యాడు...
***************
వారంతా అమృతం కోసం పాలసముద్రాన్ని మథిస్తున్నారు.
దేవతలను అమరులుగా చేసేందుకు ‘అమృతం’ కావాలి.
‘అమృతం’ కోసం ప్రయత్నిస్తే వద్దన్నా వచ్చేది ‘హాలాహలం’.
‘హాలాహలం’ కాలకూట విషం. అది నిలువునా ప్రాణులని చంపేస్తుంది.
ఆ తర్వాత అమృతం వస్తే ఎంత? రాకపోతే ఎంత?
హాలాహలం వరకు ఎవరైనా హరించేస్తే ఎంత బాగుంటుంది?
అప్పుడు ఒక ‘బైరాగి’ ముందుకొచ్చాడు.
అతడు బేసి కన్నుల వాడు. గోచిపాత వాడు.
అతను మంచుని, మంటని ఒక్కటిగా లెక్క చేసే తిక్క శంకరయ్య.
చర్మమే ఆయన దుస్తులు......
భస్మమే ఆయన ఆభరణాలు.....
స్మశానమే ఆయన ఇల్లు......
భూతాలు ఆయన మిత్రులు ........
"లోకాల... కోసం నేను విషాన్నిమింగేస్తాను." అన్నాడు.
"రేపు రాబోయే అమృతం కోసం నేడు హాలాహలం తాగేస్తాను" అన్నాడు.
హాలాహల విషమంటే మాటలా? విషం దహించి వేస్తుంది. ఆవిరులు ఊపిరిని ఆపేస్తాయి.
అయినా విషాన్ని ఖుషీగా తాగేస్తానంటున్నాడు తిక్క శంకరయ్య.
"నాకోసం విషాన్ని తాగుతున్నావా తండ్రీ?" ఆప్యాయంగా అనుకుంది పాము.
అంతే చర చర బిర బిర వచ్చి విషం మంటలను తగ్గించేందుకు ఆ శంకరయ్య గొంతుకు చుట్టుకుంది.
విషం గొంతు దిగితే చతుర్దశ భువనాలు ధ్వంసమైపోతాయి.
కాబట్టి అది గొంతు దిగకుండా భార్య ‘పార్వతి’ వచ్చి ఆయనలో తాను సగమైంది.
గొంతును అదిమి పట్టుకుంది.
"జగత్తు కోసం విషం తాగుతున్న ఓ చక్కనయ్యా... నీకు చల్లదనాన్ని పంచుతా".
అంటూ చంద్రుడు శంకరయ్య తలపై కూచుని వేదన తగ్గించే చల్లదనాన్నిచ్చాడు.
శిరోభారం తగ్గించేందుకు గంగ చిరుజల్లులు కురిపించసాగింది.
..
విషం గొంతులో ఉంది.
శంకరయ్య నీల కంఠుడయ్యాడు...
గరళ కంఠుడయ్యాడు....
స్థితి కంఠుడయ్యాడు.
తల తిరుగుతోంది.
మత్తు ఆవహిస్తోంది.
విషం తన పని తాను చేసుకుంటోంది.
రాత్రి గడిస్తే కానీ విషయం అవగతం కాదు.
..
"అయ్యో మాకోసం త్యాగం చేస్తున్నావు. నీకోసం మేముంటాము" అంటూ, సప్త లోకాలు, చతుర్దశ భువనాలు, ముక్కోటి దేవతలు, శతకోటి జనాలు, అశేషకోటి జీవాలు రాత్రి తెల్లవార్లూ అతడిని కనిపెట్టుకుని నిద్ర మాని జాగారం చేశాయి.
‘సమాజం’ కోసం పనిచేసేవాడికి ‘సమాజమే’ తోడు.
‘లోకహితం’ కోరేవాడికి లోకమే హితం చేకూరుస్తుంది.
‘జనం’ కోసం విషం తాగిన వాడు.
అందుకే ‘శవం’ కాకుండా ‘శివం’ అయ్యాడు.
ఆ రాత్రి శివరాత్రి అయ్యింది!!!

Sunday, 3 March 2019

శకుని గురించి మనకు తెలియని కొన్ని నిజాలు

Spiritual messages from www.saisaranam.in.
* మన ఇతిహాసాలు *
*శకుని గురించి మనకు తెలియని కొన్ని నిజాలు*
మహాభారతంలో శకుని ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఇతడు కౌరవుల యొక్క మద్దతుదారు. ఈయన తెలివైన, పదునైన మేధస్సు కలిగిన ఒక స్వార్థపరునిగా చిత్రీకరింపబడ్డాడు. శకుని కౌరవుల మేనమామ. మీకోసం శకుని గురించి మనకు తెలియని కొన్ని నిజాలు తెలియజేస్తున్నాం. చదివేయండి!
1. శకుని సుబలుని కుమారుడు. మనకు తెలిసిన శకునికి వందమంది మేనల్లుళ్లు ఉన్నారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఆయన గాంధార రాజైన సుబలుని నూరవ పుత్రుడు. అతని సోదరులందరు చనిపోయారు. కేవలం శకుని మరియు గాంధారి మాత్రమే బ్రతికి బట్టకట్టారు.
2. శకుని చెల్లెలు గాంధారి హస్తినాపుర రాజైన, ధృతరాష్ట్రుడుని వివాహమాడింది. ఈయన పుట్టుకతో గుడ్డివాడు. శకుని, తన తండ్రి ఇష్టంతో జరిపించినప్పటికిని, చెల్లెలు ఒక గుడ్డివాడిని వివాహమాడటాన్ని ఇష్టపడలేదు. చెల్లెలు కూడా, తన భర్తను అనుసరిస్తు జీవితాంతం గుడ్డిదాని వలె, కళ్ళకు గంతలు కట్టుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు,ఆయన కోపం తారాస్థాయికి చేరింది.
3. ఆయన తన తండ్రి వద్దకు , ఈ వివాహ ప్రతిపాదనను తీసుకువచ్చిన భీష్ముని ద్వేషించేవాడు.
4. ఒక కథ ప్రకారం, శకుని చెల్లి గాంధారి తన జాతకదోష నివారణార్ధం మేకను మనువాడింది. కానీ ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడు వద్ద దాచిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు సుబలుని, శకునితో పాటుగా సుబలుని యొక్క మిగిలిన కుమారులను చాలా హింసించాడు. సుబలుని చనిపోయేంత వరకు ఆకలితో మాడ్చి, అతని ఆఖరి కోరిక తెలియజేయమన్నాడు. సుబలుడు, తన కనిష్ట కుమారుడైన శకునిని చంపకుండా విడిచిపెట్టమన్నాడు. ఇలా శకుని తన ప్రాణాలను దక్కించుకున్నాడు.
5. జరిగినదంతా మనసులో పెట్టుకుని, శకుని ధృతరాష్ట్రుడు మరియు భీష్ముని పై కక్ష పెంచుకున్నాడు. ఆ వంశాన్ని మొత్తంగా సర్వనాశనం చేస్తానని ప్రతినబూనాడు. ఈ విధంగా అతను మహాభారతంలో ఒక దుష్ట పాత్రగా అవతరించాడువివాహం మరియు చావులకు ప్రతీకారంగా, మొత్తం కౌరవ వంశాన్ని నాశనం చేసేందుకే కంకణం.కట్టుకున్న శకుని, మహాభారత యుద్ధంలో కౌరవులకు సహాయమందిస్తున్నట్లు నటిస్తూ వారి కొంప ముంచాడు.
6. తన తండ్రి చనిపోతూ, శకునిని తన బొమికలతో పాచికలు తయారు చేసి, జూదంలో వాడమని కోరుకున్నాడు. అతని కోరిక ప్రకారం శకుని పాచికలు తయారు చేయడం మాత్రమే కాక, వాటిని తన మాయలో నియంత్రించేవాడుఇలా మాయ చేయడం, హిందూ ధర్మం ప్రకారం నేరం. ఈ పాచికలను ఆయన పాండవులకు ఇచ్చి జూదంలో ఒడిపోయేటట్టు చేసాడు.
7. శకునికి ఉలుక మరియు వృకాసురులనే కుమారులున్నారు. వారు తమ తండ్రిని, వెనక్కు వచ్చి తమతో పాటు తమ రాజ్యంలో ఆనందంగా మరియు సౌకర్యంగా నివసించమని కోరుకున్నారు.కానీ శకుని, ధృతరాష్ట్రుడు మరియు భీష్ముని పై తన పగ చాలకరెవరకు వారి కోర్కెను మన్నించలేదు.
8. గ్రీక్ పురాణాలలో కూడా ప్రస్తావింపబడిన అంబి కుమారుడు, శకుని యొక్క ప్రత్యక్ష వారసునిగా నమ్ముతారు.
9. పాండవులలో ఒకడైన సహదేవుడు, కౌరవుల కొలువులో ద్రౌపదికి జరిగిన అవమానానికి శకుని కారణమని భావించి, మహాభారత యుద్ధ పద్దెనినిమిదవ రోజు, శకునిని అంతమొందించాడు.
Thanks from www.saisaranamyatra.com

Top 5 Most Famous Brahma Temples in India


Top 5 Most Famous Brahma Temples in India spiritual message from www.saisaranam.in Lord Brahma also known as Svayambhu with four faces is the creator God in the Trimurti or Hindu Trinity and credited as the creator of the universe. Brahma the forgotten creator god has few temples in India and among the most prominent is Brahma Temple Pushkar. --------------- 1- Brahma Temple, Pushkar Brahma Temple of Pushkar is also known as Jagatpita Brahma Mandir, located close to the sacred Pushkar Lake. This Brahma temple is one of very few existing Brahma temples of the Hindu and the most prominent among them. -------------------- 2- Brahma Temple, Bangalore The Brahma Temple is located behind govt school karivobanahalli in Nagasandra Post of Bangalore. It also has one of the largest Lord brahma 7 feet height 4 faces Chaturmukha statue. ----------------- 3- Brahma Temple, Carambolim The Brahma temple is situated 7 kms from Valpoi in the village of Brahma Carambolim. It is the only Brahma temple in Goa and one of the few temples dedicated to Lord Brahma in India. ------------------ 4- Brahmapureeswarar Temple, Tiruchirappalli, Tamil Nadu- The Brahmapureeswarar Temple is located in Thirupattur near Trichy,The presiding deities are Lord Brahmapureeswarar in the form of Swayambu Lingam. So there are more than one Lord Brahma temple in India apart from Brahma Temple of Pushkar. FULL DETAILS - IN SAME BLOG - https://shirdisaisaranam.blogspot.com/2018/01/lord-bramha-temple-at-thurupattur.html ---------------------- 5- Mithrananthapuram Temple, Kerala The Mithrananthapuram Trimurti Temple complex is located on the western side of Sri Padmanabhaswamy temple and dedicated to all the Trimurti’s Lord Brahma, Lord Vishnu and Lord Shiva. Mithrananthapuram Trimurti Temple is one of the most famous Trimurti Temple in India. ---------------------------- thanks from www.saisaranamyatra.com

దేవదేవుని_రహస్యం_ వేంకటేశ్వరస్వామి రూపమే...  ఆయన ఎవరిని అనుగ్రహిస్తారు అనంటే ఎవరైతే మనసునిండా ఆయననే నింపుకుని బాధ కలిగిన భాగ్యం కలిగినా నీ కరుణే కదా స్వామి

Spiritual messages from www.saisaranam.in
దేవదేవుని_రహస్యం
చూసే వారి మనసుని ఆనందం తో ముంచెత్తి ఈ జన్మకిది చాలు స్వామి అని మనసు పొంగిపోయోలా పరవశం కల్పించే రూపం ఏదైనా ఉన్నదంటే అది నిజం గా ఆ వేంకటేశ్వరస్వామి రూపమే...  ఆయన ఎవరిని అనుగ్రహిస్తారు అనంటే ఎవరైతే మనసునిండా ఆయననే నింపుకుని బాధ కలిగిన భాగ్యం కలిగినా నీ కరుణే కదా స్వామి అని ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నమస్సుమాంజలులు సమర్పిస్తారో వారికి వారి అవ్యాజమైన ప్రేమకు ఆ దేవదేవుడు ఎల్లప్పుడూ అందుబాటులో నే ఉంటాడు...
వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే..
ఈశ్వరుడు అంటాడుట “నేను చెప్పినట్టు మీరు నడుచుకోవడమే మీరు నాకు ఇచ్చే పెద్ద దక్షిణ. భగవంతుడు బంగారానికి,వజ్రాలకి పొంగిపోయే ఆయన కాదని చెబుతూ గురువు గారు ఈ కధ చెప్పారు.
ఇది వరకు తిరుమలలో “తొండమాన్ చక్రవర్తి” అనే ఆయన స్వామి వారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడట. అప్పట్లో స్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా. ఈ తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామి వారి దగ్గరికి వెళ్లి చెబుతూ ఉండేవాడుట – స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నాను. పైగా, నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి అన్నాడుట. స్వామి వారికి చిరాకు వేసి వీడికి ఒక పాఠం చెప్పాలని, నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గర లోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు. వాడిని వెళ్లి చూడు అన్నారుట స్వామి. మరుసటి రోజు వెళదాం అని అనుకుని, స్వామి వారి పాదాల క్రింద ఉన్న తులసి దళాలని శుభ్రం చేస్తున్నాడుట. అప్పుడు, తను చేయించిన బంగారు తులసి దళాల క్రింద, మట్టి తులసిదళాలు కనిపించాయుట. స్వామి వారు చెప్పారుట ఈ మట్టి దళాలు, ఆ భీముడే సమర్పించాడు నాకు అని. అప్పుడు మనసులో అనుకున్నాడుట, మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా, వీడు ఎవరో కాని వెంటనే వెళ్లి కలవాలని బయలుదేరాడుట. ఆ రోజు చాల ఎండగా ఉంది, అప్పటికే నడిచి నడిచి, భీముడి ఇంటి దగ్గరలో స్పృహ తప్పి పడిపోయాడుట. అప్పుడు ఆ భీముడే,తొండమాన్ చక్రవర్తి ని లేవదీసి తన ఇంటికి తీసుకువెల్లాడుట. తొండమాన్ చక్రవర్తి అడిగాడుట, ఒరేయ్ నువ్వు ఏమి చేస్తూ ఉంటావు? వేంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాల ఇష్టం.
భీముడు అన్నాడు, నేనేం చేస్తాను స్వామి
- కుండ చేసేముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు.
- కుండలు చేసుకునే శక్తి ని ఇచ్చావు.
- అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేసావు
- వాటి వల్ల నా సంసారం సాగుతోంది.
- నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవాడుట. ఏ పని మొదలుపెట్టినా “గోవింద” నేను చేయడమేమిటి? నీవే నాతో చేయించు కుంటున్నావు స్వామి అనేవాడుట?
అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నారుట,
వీడేమో – అంతా స్వామి వారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు,
నేనేమో – నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను.
ఇదే మనమందరము చేసే పెద్ద తప్పిదం.
భీముడు అన్నం తినే ముందు మట్టి తో చిన్న మూకుడు చేసి, అందులో అన్నం ముద్ద పెట్టి, స్వామి వారికి సమర్పించి తను తినేవాడుట. స్వామి వారు భీముడి భక్తి కి పొంగిపోయి శ్రీదేవి, భూదేవి సహితుడై, దివ్య విమానం లోంచి దిగి, భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యారుట. వెంటనే స్వామి వారు భీముడిని కౌగలించుకుని, భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి, తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్ని భీముడి మెడలో వేసారు.
అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, వారి ఆభరణాలన్నిభీముడి భార్యకి తొడిగారుట. స్వామి వారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని సశరీరంగా, వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశించారు. ఇప్పటికి స్వామి వారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగు అన్నం. ప్రతి రోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు. అదొక్కటే తింటారు స్వామి వారు.
సారాంశం:
ఎక్కడ భక్తి ఉందో అక్కడ వశుడై పోతాడు స్వామి.
ఎక్కడ గర్వం/అహంకారం ఉన్నాయో అక్కడ ఆయన ఉండరు.
సమస్త అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడాయన. ఈశ్వరా ఇదంతా
నీ సృష్టే తండ్రి, నేను నీకు ఏమైనా ఇవ్వగలనా అని అనుకోవాలట
www.saisaranamyatra.com

Saturday, 2 March 2019

వినాయకుడు ఏక దంతుడు ఎలా అయ్యాడుశ్లో|| శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే

వినాయకుడు ఏక దంతుడు ఎలా అయ్యాడు
వివరాలు by www.saisaranam.in
శ్లో|| శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే...
ఆది దేవుడిని పూజించుకుంటూ విఘ్న వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడో తెలుసుకుందాం..
కార్తవీర్యుని వధించిన అనంతరం పరుశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో వున్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడదని నివారించాడు. "పరమేశ్వరుడిని దర్శించుకోకుండా అడ్డగించడానికి నీవెవ్వడివి" అంటూ పరుశురాముడు ధిక్కరించాడు.
మాటా మాటా పెరిగి అదికాస్తా యుద్ధానికి దారితీసింది. గణపతి తన తొండంతో పరుశురామున్ని పైకిఎత్తి పడవేశాడు. పరశురామునికి కళ్ళు బైర్లుకమ్మాయి. ఆగ్రహించిన పరుశురాముడు తన చేతిలోని గ్రండ గొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు శయన మందిరము నుంచి బయటికి వచ్చారు.
నెత్తురోడుతున్న బాల గణపతిని ఎత్తుకుని పార్వతి పరశురాముడిని మందలించింది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నింపమని పరశురాముడు వేడుకున్నాడు. అంతటితో ఆ కథ సమాప్తమైనా గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకొని "ఏకదంతుడి"గా పేరు పొందాడు
www.saisaranamyatra.com

శ్రీ కపోతేశ్వర స్వామీ దివ్య సన్నిధి. కడలి గ్రామం .రాజోలు మండలం

కోనసీమలో  దర్శించవలసిన దివ్యక్షేత్రాలు – www.saisaranam.in
శ్రీ కపోతేశ్వర స్వామీ దివ్య సన్నిధి. కడలి గ్రామం .రాజోలు మండలం .తూ.గో.జిల్లా.
ఈ ఆలయం అతి పురాతన మైనది. 15,16 శతాబ్దాల మధ్య నిర్మించబడిన దేవాలయం.
శ్రీ కపోతేశ్వర స్వామీ స్వయం భూ గా వెలసినారు. ఈ ఆలయప్రతిష్ట కు పురాణ ఆధారంగా చెప్పాల్సిన విషయం  ఒకటి ఉన్నది. పూర్వకాలం లో ఒక వేట గాడు వేట నిమిత్తం ఈ ప్రాంతం లో సంచరిస్తూ ఉండగా విపరీతమైన వాన వచ్చినదట, ఆబోయ ఒక చేట్టు నీడను నిలుచున్నాడట, ఎంత సేపటికీ వర్షం తగ్గలేదు . ఆవృక్షం  పైన నివసిస్తున్న పావురాల జంట  ఇతనిని గమనించి చాలాసేపటి నుండి చెట్టుక్రింద నిరాహారం గా వున్నా ఇతనిని చూచి భాదపడి, తమ గూటిని క్రిందకు గెంటి దానిపై చెట్టు బెరడు రాపాడగా వచ్చిన నిప్పుతో మంట రగిల్చి, దానిలో పడి అతనికి ఆహారం గా మారాయట ఇది గమనించిన బోయవాడు పావురాల త్యాగ బుద్దికి చలించి పోయి ఆతను ఆ మంట ను మరింత రగిలించి తనుకూడా అగ్నికి ఆహుతి అయ్యేనట. ఇది కైలాసంలో ఉన్న శివుడు గమనించి కపోతాల త్యాగనిరతికి సంతసించి వాటిని బ్రతికించెనట . ఆకపోతాలు ఆ బోయనుకుడా బ్రతికించమని వేడుకోగా పరమ శివుడు, ఆ బోయకూ  ఆ కపోత జంటకూ  శివసాయుధ్యము అనుగ్రహించి ఈ సందర్భం గా అక్కడ కపోత త్యాగనిరతి కి గుర్తుగా కపోత రూప గుర్తులతో స్వయం భూ గా శివుడు  కపోతేశ్వర స్వామిగా వేలసెనట. శివ  లింగ ము పై ముందు వెనుక కపోత తల, రెక్కలు,పొట్టా ఆకారాలు గుర్తులుగా నేటికీ కనిపిస్తూ ఉంటాయి.
ఈ స్వామిని దర్శించుకుంటే  మానసిక శాంతి కలుగుతుందని, క్షుద్భాధ ఉండదని, అన్న వస్త్రాలకు లోటు రాదని భక్తుల విస్వాశం . శాంతి చిహ్నాలైన కపోత గుర్తు లు కలిగిన కపోతేశ్వర స్వామిని దర్శించిన వెంటనే మనసు కూ స్వాంతన లభిస్తుందని ,ఆందోళనలు , భయాలు, విచారం లో ఉన్నవారికి స్వామిని దర్శించగానే ఆత్మస్థైర్యం వచ్చి  నూతనోత్సాహం తో తలచిన కార్యాల విజయాలు పొందుతారని భక్తులు విశ్వసిస్తారు 
ఈ ఆయము సమీపంలో కపోత కుండము కలదు .ఈ తటాకం లోనికి అంతరవాహినిగా గంగానది ప్రవహిస్తుందని , ఈ కుండము లో జలము గంగాజలము తో సమానమైన పవిత్రత కలిగినదని స్థల పురాణము వలన తెలియుచున్నది. సమీపముననే స్మశాన వాటిక కలదు. ఈ రెండు కారణముల చే ఈ క్షేత్రాన్ని భక్తులు దక్షణ కాశీ గా భావిస్తారు 
శ్రీ ఆదిశంకరాచార్యులు వారు ఈ ఆలయంలో శ్రీ చక్ర సహిత బాలా త్రిపుర సుందరీ దేవిని ప్రతిష్టించినారని స్థల పురాణము వలన తెలుయుచున్నది.
కపోతేశ్వర స్వామీ ఆలయ ప్రదక్షణ మార్గంలో వినాయకుడు. శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రుడు, కుమారస్వామి,శ్రీ సీతా రాములు,నవగ్రహాలు,కాలభైరవుడు ,లింగ రూపుడుగా శ్రీ సూర్యనారాయణ మూర్తి వారల ఉపాలయాలు ఉన్నవి.
ఈ క్షేత్రానికి పాలకుని  గా జనార్ధన స్వామీ కొలువై ఉపాలయములో ఉన్నారు.
ఈ ఆలయం సమీపాన సువర్చలా సమేత ఆంజనేయ స్వామీ ఆలయం,మరియు శ్రీ, భూ,సమేత శ్రీ సత్యనారాయణ స్వామీ ఆలయములు కలవు.
కడలి గ్రామము అమలాపురం  నుండి రాజోలు వెళ్ళు    N.S.214 రహదారి లోని మామిడికుదురు గ్రామానికి  4 కి.మీ దూరములో ఉన్నది పాలకొల్లు నుండి అమలాపురం వెళ్ళు R.T.C. బస్సులో కానీ అమలమలాపురం నుండి రాజోలు వాళ్ళు బస్సులోగానీ మామిడికుదురు లో దిగి ఆటోలలో కడలి గ్రామము వెళ్ళవచ్చును.
గోదావరి పుష్కరాలకు ఈ ప్రాంతం సందర్శించు భక్తులు కడలి గ్రామములోని శ్రీ కపోతేశ్వర స్వామిని దర్శించి కపోత త్యాగనిరతిని శ్లాఘించి , కపోతేశ్వరస్వామిని అర్చించి తరించండి,
www.saisaranamyatra.com

Friday, 1 March 2019

Why betel leaflets in the form of manga for Anjaanayasamy.

ఆంజనేయస్వామికి మాల రూపంలో తమలపాకులను ఎందుకు వేస్తారు ............!!
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అఖ్ఖర్లేదు. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది.
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
అదేంటంటే- ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకుT వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు. అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు.
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
1. లేత తమల పాకుల హారాన్ని వేస్తె రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికీ త్వరగా గుణం కనిపిస్తుంది.
2. ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె మంత్ర సంభందమైన పీడలు తొలగిపోతాయి.
3. స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లబిస్తుంది.
4.స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు.
5.వ్యాపారం చేసి సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా, దానం చేస్తే వ్యాపారం భాగుపడుతుంది.
6.స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తిగా మారుతారు.
7.శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.
8.వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని తింటూ వుంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి.
9.సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె అన్ని కార్యాలలో విజయం సిదిస్తుంది.
10.హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తె పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది.
11. వాద వివాదాల్లో స్వామిని ప్రార్థించి తమలపాకుల హార ప్రసాదాన్ని తింటే జయం మీది అవుతుంది.
12. తాంబూల దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది.పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీనికి కూడా పర్ణ ప్రసాదమనే పేరు .
       🌿🌹🙏
జై శ్రీ రామ జయ రామ జయ జయ రామ

SOUTH INDIA PACKAGE OPTIONS-- Group tours, students tours, honeymoon

*SOUTH INDIA PACKAGE OPTIONS:* * *Group tours, students tours, honeymoon| FIT* *For complete quotation (tailor-made) & fastest reply* , ...